ఏవి ఆనాటి నిబద్దత కలిగిన పత్రికలు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-విశాఖపట్నం.
 సమాజంలో జరిగే పరిస్థితులను
నిర్భీతితో ప్రకటించి  అవినీతి అక్రమదారులకు సింహస్వప్నమై
తమ రచనలతో పాఠకుల మనస్సును  రంజింపచేసే
ఆనాటి పత్రికలు నేడెక్కడ
ఒక విద్వాన్ విశ్వం, ఆర్.కె. నారాయణ్ వంటి ప్రముఖులు ఉన్నా
రాజకీయ నాయకుల భయం ఒత్తిడితో వ్రాయలేక 
స్వార్ధం సంకుచితం తో పాలకుల మెప్పుకోసం
పొగడ్తలతో ముంచెత్తే పత్రికలు
లంచంతీసుకుని కొంతమంది జర్నలిస్టులు పసలేని సాహిత్యంను ప్రచురిస్తున్నారు
సమాజంలో అవినీతిని ఎండగట్టవలసిన పత్రికలే
భజన పరులుగా
ఏ ఎండకి ఆ గొడుగు పడితే
నేను డెబ్బది సంవత్సరాల వయస్సులో
అనుకుంటున్నా ఏవి  ఆనాటినిబద్దత కలిగిన పత్రికలు?
.............................
.........................

కామెంట్‌లు