రామలక్ష్మణులు నిద్ర లేచి స్నానం చేసి
విశ్వామిత్రుని నమస్కరించినారు
మునీశ్వర మేము మీ సేవకులము
తదుపరి కార్యక్రమములను తెలుపగలరు
ఓ రామ లక్ష్మణులారా వినడు నా మాట
మిథిలా నగర రాజు అయిన జనకుడు
యజ్ఞము చేయుటకు సంకల్పించినాడు
అతడు చాలా ధర్మాత్ముడు
మనమందరము అచటికి వెళ్ళుదాము
అచట ఒక మహాదనసు ఉంటుంది
దానిని నీవు కనులారా చూడవచ్చు
ఆ ధనువు సాటిలేని శక్తి గలది
గంధర్వులు అసురులు రాక్షసులు
దేవతలు సైతం ఎక్కుపెట్ట జాలరు
ఆ ధనస్సు బలము తెలుసుకొనుటకై
ఎందరో రారాజులు ప్రయత్నించినారు
మిథిలా నగరంలో బలమైన ధనస్సును చూసి
యజ్ఞమును కూడా దర్శించవచ్చు
చందన పుష్ప సుగందాలతో ధనస్సును పూజింతురు
త్వరగా చూడాలని రామ లక్ష్మణుల కుతూహలం

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి