కేరళకు చెందిన ఒక స్ఫూర్తిదాయకమైన ఆ కథానాయకుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఎవరి నోట విన్నా అతని గురించే మాటలు. అందరి హృదయాలను గెలుచుకుంటున్న ఆ వ్యక్తి పేరు ఎన్. ఎస్. రాజప్పన్. ఆయన వయస్సు 69 ఏళ్ళు. కొట్టాయంజిల్లాలోని కుమారకోమ్కు చెందిన అతను దివ్యాంగుడు.
పోలియో కారణంగా మోకాళ్ల కింది భాగం పక్షవాతానికి గురయ్యాయి. అతను పాక్షికంగా శిథిలమైన ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి సోదరే అండ.
రాజప్పన్, తన రోజులను వేంబనాడ్ సరస్సు నీటిని శుభ్రం చేస్తూ గడుపుతున్నాడు. నడవలేకపోయి నప్పటికీ, అతను ప్రతిరోజూ ఒంటరిగా ఒక చిన్న పడవను నడుపుకుంటూ వెళ్లి, సరస్సులో తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిళ్ళు, ఇతర వ్యర్థాలను సేకరిస్తాడు. నీటిని శుభ్రంగా ఉంచాలనే అతని అంకితభావం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది.
రాజప్పన్ దినచర్య అంత సులభం కాదు. అతను కదలడానికి చేతులను ఉపయోగిస్తాడు, పడవ ఎక్కి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి బ్యాక్వాటర్స్ గుండా పడవ నడుపుతాడు. తరువాత అతను సేకరించిన వాటిని స్క్రాప్గా అమ్ముతాడు. కిలో వ్యర్థానికి రూ.12 లభిస్తాయి.
కానీ అతనికి ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కంటే ఎక్కువ. ప్రకృతిని రక్షించడం, కేరళలోని ఈ అందమైన సరస్సును కాలుష్యం నుండి కాపాడటం అతని ధ్యేయంగా మారింది.
అతని కథ ధైర్యానికి, పట్టుదలకు, పర్యావరణంపై ప్రేమకు ప్రతీకగా నిలిచింది.
వేంబనాడ్ సరస్సులో కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తరుణంలో, కేవలం ఒక్క వ్యక్తి ఇంతటి ప్రభావాన్ని సృష్టించగలడని రాజప్పన్ కృషి అందరికీ గుర్తుచేస్తుంది. చాలా మంది అతన్ని నిజ జీవిత హీరో అని, యావత్ దేశానికి స్ఫూర్తి అని కొనియాడుతుంటాడు.
ప్రకృతి పరిరక్షణ పట్ల అతనికున్న అంకితభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించడంతో, ఆయన కృషి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
పోలియో కారణంగా మోకాళ్ల కింది భాగం పక్షవాతానికి గురయ్యాయి. అతను పాక్షికంగా శిథిలమైన ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి సోదరే అండ.
రాజప్పన్, తన రోజులను వేంబనాడ్ సరస్సు నీటిని శుభ్రం చేస్తూ గడుపుతున్నాడు. నడవలేకపోయి నప్పటికీ, అతను ప్రతిరోజూ ఒంటరిగా ఒక చిన్న పడవను నడుపుకుంటూ వెళ్లి, సరస్సులో తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిళ్ళు, ఇతర వ్యర్థాలను సేకరిస్తాడు. నీటిని శుభ్రంగా ఉంచాలనే అతని అంకితభావం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది.
రాజప్పన్ దినచర్య అంత సులభం కాదు. అతను కదలడానికి చేతులను ఉపయోగిస్తాడు, పడవ ఎక్కి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి బ్యాక్వాటర్స్ గుండా పడవ నడుపుతాడు. తరువాత అతను సేకరించిన వాటిని స్క్రాప్గా అమ్ముతాడు. కిలో వ్యర్థానికి రూ.12 లభిస్తాయి.
కానీ అతనికి ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కంటే ఎక్కువ. ప్రకృతిని రక్షించడం, కేరళలోని ఈ అందమైన సరస్సును కాలుష్యం నుండి కాపాడటం అతని ధ్యేయంగా మారింది.
అతని కథ ధైర్యానికి, పట్టుదలకు, పర్యావరణంపై ప్రేమకు ప్రతీకగా నిలిచింది.
వేంబనాడ్ సరస్సులో కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తరుణంలో, కేవలం ఒక్క వ్యక్తి ఇంతటి ప్రభావాన్ని సృష్టించగలడని రాజప్పన్ కృషి అందరికీ గుర్తుచేస్తుంది. చాలా మంది అతన్ని నిజ జీవిత హీరో అని, యావత్ దేశానికి స్ఫూర్తి అని కొనియాడుతుంటాడు.
ప్రకృతి పరిరక్షణ పట్ల అతనికున్న అంకితభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించడంతో, ఆయన కృషి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి