నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 96వ పుస్తకం "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ పౌర గ్రంథాలయం, ద్వారకా నగర్, విశాఖలో ఘనంగా జరిగింది.విశాఖ సంస్కృతి మాస పత్రిక ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అడపా రామకృష్ణ, చల్లా రాంబాబు, శిరేల సన్యాసిరావు, పద్య కవి చిన సూరి, మస్తాన్ రెడ్డి, సామాజిక సేవకులు పలకలూరి శివరావు మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శివరావు పలకలూరి వారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సాలూరు మాధవరావు, నూకరాజు,సాహితీవేత్తలు కూచిమంచి నాగేందర్,,కళాకారులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
విశాఖలో కవి సోమన్న "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 96వ పుస్తకం "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ పౌర గ్రంథాలయం, ద్వారకా నగర్, విశాఖలో ఘనంగా జరిగింది.విశాఖ సంస్కృతి మాస పత్రిక ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అడపా రామకృష్ణ, చల్లా రాంబాబు, శిరేల సన్యాసిరావు, పద్య కవి చిన సూరి, మస్తాన్ రెడ్డి, సామాజిక సేవకులు పలకలూరి శివరావు మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శివరావు పలకలూరి వారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సాలూరు మాధవరావు, నూకరాజు,సాహితీవేత్తలు కూచిమంచి నాగేందర్,,కళాకారులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి