రాంపూర్ అనే ఊరిలో ప్రాథమిక పాఠశాల ఉంది. పైచదువులు పాలమాకుల పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు.ఐదుగురు స్నేహితులు కలిసి పాలమాకుల బడికి వెళ్లేవారు.చెరువు కట్ట కింద పదిమంది కాలేజి విద్యార్థులు పేకాట ఆడుచున్నారు.
మొదటగా రవి అనే పిల్లవాడు వీళ్ళ పేకాటను గమనించాడు.మెల్లమెల్లగా ఆట నేర్చుకున్నాడు.బడికి వెళ్లడంలేదు.
మిగతా స్నేహితులు ఒరేయ్ రవి ఈ పేకాట మంచిది కాదురా బడికి వెళ్దాము అని అంటారు.
మీకు తెలవదు రా! దీనిలో ఉన్న మజానేవేరు.
చాలా మంచిగ ఉంటుంది.
రండిరా మీరు ఆడుదురు బలవంతంగా ఆట నేర్పుతాడు.ఒకవేళ గెలిస్తే మనకు చాలాడబ్బులు వస్తాయిరాఅని రవి అంటాడు.ఇకనుండి మీరు కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న నడిగి డబ్బులు తీసుకరండి అని చెబుతాడు.మా ఇంట్లో నుండి నేను 500 తెచ్చుకున్నారా! మీరు కూడా తెచ్చుకోండి. మంచిగా రోజు ఆడుదాం. మంచిగ ఎంజాయ్ చేద్దాం రా! అని రవి అంటాడు.
రవి వాళ్ళ అమ్మ రోజు డబ్బులు తీసికెళ్తున్నాడు.ఏంచేస్తున్నాడని అమ్మకు అనుమానం ఎక్కువైంది.
ఒకరోజు వీళ్ళకు తెలియకుండా అమ్మ బడికి వెళుతుంది.రవి బడిలో లేడు.తిరిగి వస్తుండగా వీరు కట్టకింది పేకాట ఆడుతున్నారు.అప్పుడు వీళ్ళ అమ్మ చూస్తుంది.
వీళ్ళ సంగతి గిట్ల ఉందా అని రాజగోపాల్ పేటకు పోతుంది. పోలీసులను తీసుకొని వస్తుంది.పోలీసులు వీళ్ళందర్నీ పట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అప్పుడు పేకాట వలన నష్టాల గూర్చి వివరించి చెప్తారు. పేకాట ఎక్కువైతే మీరు దొంగతనాలు చేస్తారు. చదువు పాడౌతుంది.దొంగలుగా మారుతారు.మీ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు.మీరు బాగా చదువుకోవాలి. అందరికి మంచి మాటలు చెబుతారు.పిల్లలందరూ నిజాలను తెలుసుకుంటారు. ఇప్పటి నుంచి మేము పేకాట ఆడము అని ప్రమాణం చేస్తారు.ఇంటికి వస్తారు.అప్పటి నుంచి క్రమశిక్షణగా బడికి వెళ్లి చదువుకొని గొప్పవారిగా తయారవుతారు.
.
మొదటగా రవి అనే పిల్లవాడు వీళ్ళ పేకాటను గమనించాడు.మెల్లమెల్లగా ఆట నేర్చుకున్నాడు.బడికి వెళ్లడంలేదు.
మిగతా స్నేహితులు ఒరేయ్ రవి ఈ పేకాట మంచిది కాదురా బడికి వెళ్దాము అని అంటారు.
మీకు తెలవదు రా! దీనిలో ఉన్న మజానేవేరు.
చాలా మంచిగ ఉంటుంది.
రండిరా మీరు ఆడుదురు బలవంతంగా ఆట నేర్పుతాడు.ఒకవేళ గెలిస్తే మనకు చాలాడబ్బులు వస్తాయిరాఅని రవి అంటాడు.ఇకనుండి మీరు కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న నడిగి డబ్బులు తీసుకరండి అని చెబుతాడు.మా ఇంట్లో నుండి నేను 500 తెచ్చుకున్నారా! మీరు కూడా తెచ్చుకోండి. మంచిగా రోజు ఆడుదాం. మంచిగ ఎంజాయ్ చేద్దాం రా! అని రవి అంటాడు.
రవి వాళ్ళ అమ్మ రోజు డబ్బులు తీసికెళ్తున్నాడు.ఏంచేస్తున్నాడని అమ్మకు అనుమానం ఎక్కువైంది.
ఒకరోజు వీళ్ళకు తెలియకుండా అమ్మ బడికి వెళుతుంది.రవి బడిలో లేడు.తిరిగి వస్తుండగా వీరు కట్టకింది పేకాట ఆడుతున్నారు.అప్పుడు వీళ్ళ అమ్మ చూస్తుంది.
వీళ్ళ సంగతి గిట్ల ఉందా అని రాజగోపాల్ పేటకు పోతుంది. పోలీసులను తీసుకొని వస్తుంది.పోలీసులు వీళ్ళందర్నీ పట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అప్పుడు పేకాట వలన నష్టాల గూర్చి వివరించి చెప్తారు. పేకాట ఎక్కువైతే మీరు దొంగతనాలు చేస్తారు. చదువు పాడౌతుంది.దొంగలుగా మారుతారు.మీ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు.మీరు బాగా చదువుకోవాలి. అందరికి మంచి మాటలు చెబుతారు.పిల్లలందరూ నిజాలను తెలుసుకుంటారు. ఇప్పటి నుంచి మేము పేకాట ఆడము అని ప్రమాణం చేస్తారు.ఇంటికి వస్తారు.అప్పటి నుంచి క్రమశిక్షణగా బడికి వెళ్లి చదువుకొని గొప్పవారిగా తయారవుతారు.
.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి