పిసినారి అవ్వ - టక్కరి పిల్లోళ్ళు - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక అవ్వ వుండేది. ఆమె చానా పిసినారిది. ఆమెకు ఐదుమంది మనవళ్ళు వుండేటోళ్ళు. వాళ్ళు చానా టక్కరోళ్ళు.
ఒకరోజు అవ్వకు బచ్చాలు చేసుకోని తినాలనిపించింది. కానీ పిల్లలందరికీ చేస్తే చానా ఖర్చవుతుంది గదా... దాంతో ఆ పిసినారిది ఎవరికీ తెలీకుండా మట్టసంగా రాత్రి అందరూ పండుకున్నాక చేసుకోవాలనుకోనింది. బచ్చాలకు కావలసిన బెల్లం, బ్యాళ్ళు కొనుక్కోనొచ్చి ఉడకేసి పూర్ణం రుబ్బి మచ్చుపైన పెట్టింది. అలా పెట్టడం పెద్ద పిల్లోడు చూసినాడు. "అవ్వ మాకు తెలియకుండా ఏమో చేసుకొని ఒక్కతే తినాలని అనుకుంటోంది. కనుక్కోవాల" అనుకున్నాడు.
ఆరోజు రాత్రి అందరూ పండుకున్నాక ఆ ముసల్ది లేచి వంటింట్లోకి పోయింది. చప్పుడు గాకుండా మట్టసంగా బచ్చాలు చేయడం మొదలు పెట్టింది.
పెద్దోడు మొదట్నించీ ఇదంతా గమనిస్తా వున్నాడు గదా! దాంతో నెమ్మదిగా లేచి వాకిలి కాన్నించి లోపలికి తొంగి చూసినాడు. అవ్వ లోపల బచ్చాలు చేస్తా కనబడింది.
“ఓహో... ఇదా సంగతి” అనుకోని మట్టసంగా తిరిగి వచ్చి పండుకోని "అవ్వా ... నీళ్ళు దప్పిక అవుతున్నాయే” అని గట్టిగా అరిచినాడు. 
ఆ అరుపులకు ముసల్ది వులిక్కిపడింది. 
“వాని అరుపులకు మిగతా పిల్లలు యాడ లేస్తారో... ఏమో...” అని భయపడతా నీళ్ళు బెరబెరా తీసుకోని పోయి వానికి ఇచ్చింది.
వాడు నీళ్ళు తాగి "అవ్వా... ఏందే బచ్చాల వాసన వస్తావుంది. ఏం చేస్తా వున్నావు” అంటూ వంటింట్లోకి దూరినాడు. పొయ్యి పక్కన బచ్చాలు చూసి "నాకు పెట్టే” అని ఏడవసాగినాడు. 
ఆ ఏడుపుకు మిగతా పిల్లలు
లేస్తారేమోనని భయపడిన ముసల్ది “ఎవరికీ చెప్పొద్దు” అంటూ వానికి రెండు బచ్చాలు పెట్టింది. వాడు అవి తిని పోయి పండుకున్నాడు.
అవ్వ మళ్ళా బచ్చాలు చేయడం మొదలుపెట్టింది. పెద్ద పిల్లోడు కాసేపటికి పక్కనున్నోన్ని నెమ్మదిగా లేపి “రేయ్... అవ్వ ఒక్కతే బచ్చాలు చేసుకుంటా వుంది. రేపు మనకు ఒక్కటి గూడా దొరకవు. పో...పోయి తినిరాపో” అని చెప్పినాడు.
వాడు సరేనని తలూపి "అవ్వా... ఒంటికొస్తుందే” అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టినాడు “ఓరినీ... సచ్చినోడా... నీకూ ఇప్పుడే రావాల్నా?" అనుకుంటా అవ్వ వురుక్కుంటా వచ్చి వాన్ని బైటకు తీసుకోని పోయింది.
వాడు ఒంటికి పోసి పోతాపోతా "అవ్వా... ఏందే బచ్చాల వాసన వస్తావుంది. ఏం చేస్తున్నావు ఈ రాత్రిపూట” అంటూ అమాయకంగా అడుగుతూ వాడు కూడా వంటింట్లోకి దూరినాడు. 
పెనం మీద కాలుతా వున్న బచ్చం చూసి "అవ్వా... నాకూ ఒక రెండు పెట్టే” అని ఏడవడం మొదలు పెట్టినాడు. ఆ ఏడుపుకు మిగతా పిల్లలు లేస్తారేమోనని భయపడిన ముసల్ది “ఎవరికీ చెప్పొద్దు” అంటూ వానికి గూడా రెండు బచ్చాలు పెట్టింది. వాడు అవి హాయిగా తిని పోయి పండుకున్నాడు. 
అవ్వ మరలా బచ్చాలు చేయడంలో మునిగిపోయింది.
కాసేపటికి వాళ్ళు మిగతా ముగ్గురినీ లేపి జరిగిందంతా చెప్పి ఏం చేయాలో చెప్పినారు.
సరే అని కాసేపటికి మూడోవాడు "అవ్వా ... వీడు సూడే! మాటిమాటికీ గిచ్చుతా వున్నాడు.” అంటూ ఏడుస్తా పైకి లేచినాడు. అవ్వ ఉరుక్కుంటా బైటికొచ్చి “లేదులే ... లేదులే ... ఏడవమాకు. నువ్వు ఈ పక్క పండుకుందువురా” అంటూ వాన్ని లేపింది. 
వాడు లేసి పోతాపోతా "నన్ను గిచ్చుతావురా నువ్వు” అంటూ నాలుగోవాన్ని ఈడ్చి ఒకటి తన్నినాడు.
“అంతే... నాలుగోవాడు ఉలిక్కిపడి పైకి లేచి “ఏరా... నిద్ర పోతావుంటే నన్ను కొడ్తావా” అంటూ ఎగిరి వాన్ని దొబ్బినాడు. 
అంతే వాడు పోయి ఐదోవాని మీద పడినాడు. 
అంతే "అవ్వా... చూడే” అంటూ వాడు కూడా లేచి వాళ్ళ మీద కలబన్నాడు. అట్లా ఒకరి మీద ఒకరు పడతా ఐదుమందీ లేచి ఒకరినొకరు తన్నుకోసాగినారు.
అంతలో చిన్నోడు "రేయ్ ... వంటింట్లోంచి బచ్చాల వాసన వస్తావుంది రోయ్” అంటూ గట్టిగా అరిచినాడు.
అంతే ... మిగతా వాళ్ళు కొట్లాట ఆపేసి ముక్కులు ఎగబీలుస్తా “అవున్రోయ్... అవ్వ రేప్పొద్దున లేస్తూనే మనకి పెట్టడం కోసం చేస్తున్నట్లుంది రోయ్” అంటూ గట్టిగా అరిచినారు. అవ్వ అదిరిపడింది.
పిల్లలందరూ ఒక్కసారిగా వంటింట్లోకి జొరబన్నారు. గిన్నె తీసి తలా కొన్ని బచ్చాలు ఏసుకోని నున్నగా అన్నీ తిని హాయిగా నవ్వుకుంటా నిద్రపోయినారు.
ఎవ్వరికీ పెట్టకుండా అన్నీ తానే తినాలకున్న ఆ ముసల్దానికి ఆఖరికి ఒక్క బచ్చం గూడా మిగలలేదు.
**********
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం