-- ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం
--
ఆదర్శంగా నిలిచిన మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్
--
ఆదర్శంగా నిలిచిన మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు వారిపై అత్యధిక శ్రద్ధ కనపరుస్తున్నామని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో
ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారిని తొట్ల (ముస్కే) సంధ్య, అంకంపల్లి పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న బండారి కుమార్ లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అధికారిని సంధ్య తన కూతురు విహాన్సీ, బండారి కుమార్ తన ఇద్దరు కూతుళ్లు ఆధ్యా, రియాలను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన, శాస్త్రీయమైన విద్యా విధానాలను అమలు చేస్తూ, అక్కడి ఉపాధ్యాయులు పిల్లల్ని అద్భుతంగా తయారు చేయడం గమనించిన వారు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. వీరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎందరికో ఆదర్శనీయులు. వీరిని గ్రామం, మండలం, జిల్లాలోని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరులకు వీరిద్దరూ ఆదర్శంగా పిలవడం పట్ల వారు మిక్కిలి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పంట చేను లాంటి ప్రభుత్వ పాఠశాలలను వదిలి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపించడం ఘోరమైన విషయమన్నారు. నేతిబీరలో నెయ్యి ఉండనట్లే, ప్రైవేట్ పాఠశాలల్లో ఏమీ లేదని, 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా తల్లిదండ్రులు అక్కడ ఏదో ఉందని భ్రమ పడుతున్నారన్నారు. చదువుతోపాటు అక్కడ కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని స్వయాన ఒక విద్యాశాఖ అధికారే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పిల్లల్ని బాగా చదివించి, వారిని క్రమశిక్షణగా ఉంచుతూ అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు గాను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండుసార్లు 'బెస్ట్ స్కూల్ అవార్డు' పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి శంకర్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారిని తొట్ల (ముస్కే) సంధ్య, అంకంపల్లి పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న బండారి కుమార్ లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అధికారిని సంధ్య తన కూతురు విహాన్సీ, బండారి కుమార్ తన ఇద్దరు కూతుళ్లు ఆధ్యా, రియాలను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన, శాస్త్రీయమైన విద్యా విధానాలను అమలు చేస్తూ, అక్కడి ఉపాధ్యాయులు పిల్లల్ని అద్భుతంగా తయారు చేయడం గమనించిన వారు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. వీరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎందరికో ఆదర్శనీయులు. వీరిని గ్రామం, మండలం, జిల్లాలోని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరులకు వీరిద్దరూ ఆదర్శంగా పిలవడం పట్ల వారు మిక్కిలి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పంట చేను లాంటి ప్రభుత్వ పాఠశాలలను వదిలి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపించడం ఘోరమైన విషయమన్నారు. నేతిబీరలో నెయ్యి ఉండనట్లే, ప్రైవేట్ పాఠశాలల్లో ఏమీ లేదని, 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా తల్లిదండ్రులు అక్కడ ఏదో ఉందని భ్రమ పడుతున్నారన్నారు. చదువుతోపాటు అక్కడ కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని స్వయాన ఒక విద్యాశాఖ అధికారే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పిల్లల్ని బాగా చదివించి, వారిని క్రమశిక్షణగా ఉంచుతూ అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు గాను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండుసార్లు 'బెస్ట్ స్కూల్ అవార్డు' పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మండల వ్యవసాయ అధికారిణి సంధ్య, టీచర్ బండారి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి శంకర్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి